crime: కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై యువ‌కుడి దాడి.. సృహ‌ కోల్పోయిన యువ‌తి


అనంత‌పురంలోని అనంత‌ల‌క్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు మ‌ధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. ఆ కాలేజీలో ఎంబీఏ రెండో సంవ‌త్స‌రం విద్యార్థినిపై హ‌రీశ్ అనే ఓ యువ‌కుడు దాడి చేశాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ గ‌త‌కొంత కాలంగా హ‌రీశ్‌ ఆమె వెంటప‌డుతూ వేధిస్తున్నాడు. అయితే, ఆ యువ‌తి పెళ్లికి నిరాక‌రించినందుకు ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర‌ గాయాల పాల‌యిన ఆ విద్యార్థిని సృహ‌ కోల్పోయింది. ఆమెను సమీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. నిందితుడిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీఎస్పీ మ‌ల్లికార్జున శ‌ర్మ అన్నారు.

  • Loading...

More Telugu News