crime: ఉత్తరప్రదేశ్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌... న‌డిరోడ్డుపై మ‌హిళ‌ను విచక్షణా రహితంగా కొట్టిన యువ‌కులు


ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌డిరోడ్డుపై ఓ మ‌హిళ‌ను ఇద్ద‌రు యువ‌కులు విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. మెయిన్‌ పురిలోని రద్దీగా ఉండే మార్కెట్‌కి బాధిత‌ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ‌చ్చింది. మార్కెట్‌లో ఉన్న ఇద్దరినీ ఓ అడ్రస్ చెప్ప‌మ‌ని అడిగింది. అయితే, ఆ ఇద్దరు యువ‌కులు ఆమెతో అస‌భ్యంగా ప్రవర్తించారు.

ఆమెతో దుర్భాషలాడి ఆమె చేయిపట్టుకొని లాగేందుకు యత్నించారు. దీంతో ప్ర‌తిఘ‌టించిన స‌ద‌రు మ‌హిళ వారి చెంప పగులకొట్టింది. దీంతో ఆ యువకులు రెచ్చిపోయి ఆమె భర్త ఇద్దరు పిల్లల ముందే ఆమెను కర్రలతో కొట్టారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడి వారంతా ఈ దృశ్యాల‌ను వీడియోలు తీసుకుంటూ ఉన్నారే తప్ప  దాడిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఆమె త‌ల‌పై కర్ర‌ల‌తో బాది ర‌క్తం వ‌చ్చేలా కొట్టారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి కేసు న‌మోదు చేసుకున్నారు. త‌నపై దాడి చేసిన వారిని శిక్షించకుంటే తనను తాను కాల్చుకొని చచ్చిపోతానని బాధిత మహిళ బెదిరించింది. నిందితులను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటికే నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News