cricket: చెన్న‌య్ టెస్టు: అర్ధ‌సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన టీమిండియా ఓపెనర్లు


చెన్న‌య్‌లో జ‌రుగుతున్న ఇంగ్లండ్‌, భార‌త్ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌, పార్థివ్ ప‌టేల్‌ అర్ధ సెంచ‌రీల‌తో స్కోరుబోర్డుని క‌దిలించారు.  60/0 ఓవర్ నైట్ స్కోరుతో  ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఓపెన‌ర్లు నిలకడగా బ్యాటింగ్ చేశారు. 157 బాల్స్ ఆడిన‌ పార్థీవ్ పటేల్ 71 ప‌రుగుల వ్య‌క్తిగత స్కోరు వ‌ద్ద అలీ బౌలింగ్‌లో భారీ షాట్ కు ప్ర‌యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. పార్థివ్‌, రాహుల్‌ల జోడి మొత్తం 152 పరుగులు జోడించింది. అనంత‌రం క్రీజులోకి ఛ‌టేశ్వ‌ర పూజారా వ‌చ్చాడు. కేఎల్ రాహుల్ 89 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 173/1 (48 ఓవ‌ర్ల‌కి)గా ఉంది. 

  • Loading...

More Telugu News