పీఆర్కే హాస్పిటల్ లో కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు

Related image

రంగారెడ్డి జనవరి 09: శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీఆర్కే హాస్పిటల్ నందు కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమా ఫోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి కరోన మహమ్మారి ప్రపంచంలోని ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిందని తెలిపారు. ప్రజల భద్రతకై అన్ని దేశాల శాస్త్ర వేత్తలు కరోన నిర్ములించుటకు కష్టపడి కరోన వాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో కి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కరోన వ్యాక్సిన్ అందించే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 2లక్షల 90వేల మందికి కరోన వాక్సిన్ వేయబడుతుందని, ముందుగా ఫ్రన్ట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కరోన వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కరోన వ్యాక్సిన్ 2 డోసులు వేయబడతాయని, ఈ నెల 2న ఏడు సెంటర్లలో 8న 800 సెంటర్లలో కరోన వాక్సిన్ వేయుటకు డ్రైరన్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోన వ్యాక్సిన్ వేయుటకు పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పత్రులతో పాటు ప్రయివేటు హాస్పిటల్ లలో కూడా డ్రైరన్ నిర్వహిస్తున్నాయని పీఆర్కే హస్పిటల్లో 167 మంది వైద్య సిబ్బంది ఉన్నారని, ఈ హాస్పిటల్ లో రోగులకు  వైద్య సేవలు అందించుటకు అన్ని హాంగులతో కూడిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధి, పీఆర్కే హాస్పిటల్ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఎండీ పుట్టా రవికుమార్, డీ.ఎం.ఎండ్ హెచ్ ఓ స్వరాజ్య లక్ష్మీ, అడిషనల్ డీ.ఎం.అండ్ హెచ్ ఓ సృజన, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases