Andhra Pradesh: టీడీపీ ముహూర్త బలం గొప్పది.. చాలా మంది ఇబ్బంది పెట్టినా ముందుకే వెళుతున్నాం: చంద్రబాబు

Chandrababu Talks To NRIs On Party Anninversary

  • 40 దేశాల్లో పార్టీ ఎన్నారై విభాగం సంబరాలు
  • తెలుగువారి చరిత్ర అంటే టీడీపీకి ముందు ఆ తర్వాతే
  • ఆత్మగౌరవ బావుటా టీడీపీ అన్న పార్టీ అధినేత

టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన ముహూర్త బలం చాలా గొప్పదని, అందుకే ఎన్ని ఆటంకాలెదురైనా తట్టుకుంటోందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీని ఎంతో మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా అంతకన్నా ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 

టీడీపీకి ముందు.. ఆ తర్వాత అనేలా తెలుగు చరిత్రను చదువుకోవాల్సిందేనన్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఎన్నారై విభాగం 40 దేశాల్లోని 200 నగరాల్లో నిర్వహిస్తున్న వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నారైలు ఎక్కడున్నా రాష్ట్ర భవిష్యత్ కు అండగా నిలబడాలని, తోడ్పాటును అందించాలని కోరారు. 

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని, ప్రజల సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆరేనని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారని గుర్తు చేశారు. 

ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆహార భద్రత పథకాన్ని.. రూ.2కే కిలో బియ్యం పథకం పేరిట ఎప్పుడో ఎన్టీఆర్ అమలు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News