Chandrababu: కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి చంద్ర‌బాబు లేఖ‌లు

chandrababu writes letter to gadkari

  • కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు ప‌రిస్థితిపై ఓ లేఖ‌
  • అక్క‌డ‌ అండర్ పాస్‌ నిర్మించాల‌ని విన‌తి
  • నందిగామ మండలం మునగచర్ల వద్ద కూడా నిర్మించా‌ల‌ని మ‌రో లేఖ‌

కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు లేఖలు రాశారు. కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఆయ‌న అందులో వివ‌రించారు. అక్క‌డ‌ అండర్ పాస్‌ నిర్మించాల‌ని కోరారు.  

అది లేకపోవడంతో స్థానిక గ్రామాల రైతులు, విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. అలాగే, నందిగామ మండలం మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంపైనా మరో లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బందుల‌ను గ‌డ్క‌రీ దృష్టికి తీసుకొచ్చారు.  

  • Loading...

More Telugu News