Pawan Kalyan: కత్తుల్ బట్టక స్వేచ్ఛరాదెపుడు: జాషువా పద్యాన్ని గుర్తు చేసిన పవన్ కల్యాణ్

  • నేతాజీ సుభాష్‌ చంద్రబోసు జయంతి సందర్భంగా ఆయనకు సెల్యూట్ 
  • నేతాజీ గురించి గుర్రం జాషువా రాసిన ఓ పద్యాన్ని పోస్ట్ చేసిన పవన్ 
  • నేతాజీకి మోదీ నివాళులర్పించిన వీడియోనూ పోస్ట్ చేసిన పవన్

నేతాజీ సుభాష్‌ చంద్రబోసు జయంతి సందర్భంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా నేతాజీ గురించి గుర్రం జాషువా రాసిన ఓ పద్యాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
 
'జాతీయ సభాపతియై నేతాజీ సుభాష్‌ చంద్రబోసు నిఖిల భరత విఖ్యాతిం గడించి గాంధీ చేతంబునకెక్కె సాహసిక సింహంబై. కత్తుల్ బట్టక స్వేచ్ఛరాదెపుడు చర్ఖాపద్ధతుల్ పూర్తిగా చిత్తైపోవు నటంచు గాంధీయునితో సిద్ధాంతమున్ జేసి భూభ్యత్తుల్ దెల్లని చక్రవర్తులు భవప్తిన్ గ్రుంగి కంగారుగా నెత్తించెన్ యావరెస్టు నెత్తయుల పై హిందూరణ స్తంభమున్' అనే పద్యాన్ని పోస్ట్ చేశారు. అలాగే, నేతాజీకి ప్రధాని మోదీ నివాళులర్పించిన వీడియోనూ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News