Nabha Natesh: పారితోషికాన్ని రెట్టింపు చేస్తూ వెళుతున్న నభా నటేశ్

  • నభా నటేశ్ కి యూత్ లో క్రేజ్ 
  • తెలుగులో పెరుగుతున్న అవకాశాలు 
  • స్టార్ హీరోయిన్ల జాబితాకు చేరువలో నభా

తమిళ .. కన్నడ చిత్రపరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కథానాయికలు అందుకునే పారితోషికమే ఎక్కువ. అందువలన తెలుగు సినిమాలు చేయడానికే కథానాయికలు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అలా కన్నడ సినిమాల్లో తక్కువ పారితోషికమే తీసుకుంటున్న నభా నటేశ్, తెలుగులో పారితోషికాన్ని పెంచుతూ వెళుతోందని ఫిల్మ్ నగర్లో  చెప్పుకుంటున్నారు.

'ఇస్మార్ట్ శంకర్' కోసం ఈ సుందరికి దక్కిన పారితోషికం 20 లక్షలు. ఆ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మాయి తన పారితోషికాన్ని 40 లక్షలు చేసేసింది. అదే పారితోషికాన్ని ఆమె 'డిస్కోరాజా' కోసం అందుకుంది. ఆ తరువాత సినిమాను ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో చేయనుంది. ఈ సినిమాకిగాను ఆమె 80 లక్షలను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారనే అంటున్నారు. కోటి రూపాయలకి పైగా పారితోషికాన్ని అందుకునే కథానాయికల జాబితాలో చేరిపోవడానికి నభా నటేశ్ కి ఎంతో కాలం పట్టదనే విషయం మాత్రం  అర్థమైపోతోంది.

More Telugu News