Bellamkonda Srinivas: నభా నటేశ్ భారీ పారితోషికమే డిమాండ్ చేసిందట

  • 'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయం 
  • 'ఇస్మార్ట్ శంకర్'తో ఖాతాలోకి మరో హిట్ 
  • వచ్చేనెలలో 'డిస్కోరాజా'తో ప్రేక్షకుల ముందుకు 

తెలుగు తెరకి 'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయమైన నభా నటేశ్, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. రవితేజ జోడీగా ఆమె చేసిన 'డిస్కోరాజా' వచ్చేనెల చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలోనూ ఈ సుందరి ఛాన్స్ కొట్టేసింది.

ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ కు అమ్మడు సైన్ చేసిందని అంటున్నారు. అదే బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నభా నటేశ్ ను తీసుకున్నారట. ఇందుకుగాను ఈ అమ్మాయి డిమాండ్ చేసిన మేరకు భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని అంటున్నారు. రేపు ఉదయం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News