Janasena: ‘జనసేన’కు మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శుల నియామకం

  • మరో ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ
  • కార్యదర్శులుగా  గద్దె తిరుపతిరావు, చిల్లపల్లి శ్రీనివాస్
  • ఈ రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి

జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు నియమించినట్టు పేర్కొంది. ఈ రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ముగ్గురు కొన్ని సంవత్సరాలుగా పార్టీకి విలువైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. విశాఖ నగరానికి చెందిన సత్య పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పార్టీ తరపున పని చేస్తారని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News