Diwali: దీపావళి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' సరికొత్త పోస్టర్

  • స్టయిలిష్ లుక్ లో మహేశ్ బాబు
  • జనవరి 12న వస్తున్న సరిలేరు నీకెవ్వరు
  • ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన చిత్రబృందం

మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని 'సరిలేరు... ' చిత్రబృందం అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో మహేశ్ బాబు రాయల్ ఎన్ ఫీల్డ్ బండిపై ఠీవిగా కూర్చుండడం చూడొచ్చు.

కళ్లకు సన్ గ్లాసులు, టీషర్టు, ట్రెండీ ప్యాంట్స్ లో మహేశ్ చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. చాన్నాళ్ల తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఈ చిత్రం ద్వారానే రీఎంట్రీ ఇస్తున్నారు.

More Telugu News