Narendra Modi: రేపు తిరుమలకు మోదీ.. స్వాగతం చెప్పనున్న జగన్

  • శ్రీలంక నుంచి రేణిగుంట చేరుకోనున్న మోదీ
  •  కార్యకర్తలతో మోదీ సమావేశం 
  • ప్రధానితో కలసి శ్రీవారి దర్శనానికి సీఎం 

ఏపీ సీఎం జగన్ రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తిరుమల వస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోదీ రేపు శ్రీలంక నుంచి రేణిగుంట చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం హోదాలో జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం మోదీ బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం ఆరింటికి మోదీ, జగన్ శ్రీవారి దర్శనం చేసుకుంటారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ హస్తిన పయనం అవుతారు. కాగా, ఏపీ సీఎం జగన్ ఇవాళ తన క్యాబినెట్ ప్రమాణస్వీకారంతో బిజీగా గడిపారు. కొత్త క్యాబినెట్ తో సరికొత్తగా పాలన మొదలుపెట్టనున్న ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News