Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వేశ్య పాత్రలో గ్లామరస్ హీరోయిన్ 
  • నెలాఖరుకి వస్తున్న 'బుర్రకథ'
  • 'అర్జున్ రెడ్డి' దర్శకుడికి మరో ఆఫర్

*  గ్లామరస్ తార పాయల్ రాజ్ పుత్ తాజాగా వేశ్య పాత్రలో నటించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో పాయల్ నాయికగా వేశ్య పాత్రను పోషిస్తుందట.
*  ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న 'బుర్రకథ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తారు.
*  'అర్జున్ రెడ్డి' చిత్ర దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సంసిద్ధత వ్యక్తం చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ హీరోగా సందీప్ హిందీలో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి అక్కడి ట్రేడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ రావడంతో అతనిని మరో స్క్రిప్ట్ రెడీ చేయమని షాహిద్ చెప్పాడట.

More Telugu News