KCR: ఏకంగా సీఎం కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు!

  • హైదరాబాద్ లో ఘటన
  • గచ్చిబౌలిలో ల్యాండ్ కొనుగోలుకు కేసీఆర్ సంతకంతో సిఫారసు లేఖ సృష్టి
  • ప్రధాన నిందితుడు మహ్మద్ ఉస్మాన్ అరెస్ట్

కొందరు కేటుగాళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఓ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 44/p సర్వే నంబర్ లో ఉన్న ఓ స్థలం కొనుగోలు కోసం ఏకంగా కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. కేసీఆర్ సంతకంతో సిఫారసు లేఖను సంబంధిత శాఖకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ ఉస్మాన్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News