KCR: వెల్దుర్తి రోడ్డు ప్రమాదం విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కేసీఆర్

  • వెంటనే వెళ్లాలంటూ గద్వాల కలెక్టర్ కు ఆదేశాలు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం
  • కర్నూలు జిల్లాలో ఘటన

తెలంగాణలోని గద్వాల జిల్లా రామాపురం వాసులు ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని తెలియడంతో సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ కు చెందిన స్కానియా బస్సు, ఓ తుఫాన్ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో తుఫాన్ వాహనంలో ఉన్న 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా గద్వాల జిల్లా రామాపురం వాసులే కావడంతో కేసీఆర్ ఈ వార్త వినగానే షాక్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ గద్వాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని స్పష్టం చేశారు.

KCR
  • Loading...

More Telugu News