Narendra Modi: దీదీ, నా మీద కోప్పడడం కాదు, ముందు వాళ్ల కోపం ఏంటో చూడండి: మమతపై మోదీ ధ్వజం

  • మమత పీడితులంటూ ఓ జాబితా పేర్కొన్న ప్రధాని
  • ముదురుతున్న మోదీ-మమత మాటలయుద్ధం
  • మమత వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరూ తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో, మోదీ తాజాగా దీదీపై విమర్శనాస్త్రాలు కురిపించారు. తనపై మమత చేసిన వ్యాఖ్యలకు స్పందనగా "దీదీ నా మీద కోప్పడడం కాదు, ముందు వాళ్ల కోపం ఏంటో చూడండి" అంటూ మోదీ ఓ జాబితాను ఆమె ముందుంచారు.
  • తృణమూల్ కాంగ్రెస్ నేతల చేతుల్లో దోపిడీకి గురైన పేద ప్రజలు
  • మీ కారణంగా కలలను భగ్నం చేసుకున్న యువతీయువకులు
  • మీ మొండి వైఖరి కారణంగా సరైన జీతాలు పొందలేకపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు
  • కనీస గౌరవమర్యాదలకు నోచుకోని పౌరులు
'నాపై ఆగ్రహం చూపించే బదులు, పైన పేర్కొన్న వర్గాల కోపాన్ని కూడా ప్రస్తావించండి దీదీ గారూ' అంటూ ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారు.

  • Loading...

More Telugu News