KCR: విజయవాడ రావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించిన స్వామి స్వరూపానందేంద్ర

  • ఫిలింనగర్ లో విశాఖ పీఠాధిపతిని కలిసిన కేసీఆర్
  • ఆశీస్సులు అందించిన స్వామీజీ
  • ఇరువురి మధ్య ఆధ్యాత్మిక విషయాల చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆయన తరచుగా యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహిస్తుంటారు. కేసీఆర్ కు ఈ విషయంలో ఎప్పటినుంచే విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, కొన్నాళ్ల కిందట విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లలేకపోయిన కేసీఆర్, ఇవాళ స్వామి స్వరూపానందేంద్ర హైదరాబాద్ వచ్చారని తెలియడంతో ఆయనను కలుసుకున్నారు.

ఫిలింనగర్ దైవసన్నిధానంలో స్వామిని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆపై, జూన్ లో విజయవాడలో జరిగే శారదా పీఠం ఉత్తరాధికారి బాధ్యత స్వీకారోత్సవానికి రావలసిందిగా సీఎం కేసీఆర్ ను స్వరూపానందేంద్ర ఆహ్వానించారు. జూన్ 15 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో కార్యక్రమ నిర్వహణ ఉంటుందని, తప్పకుండా రావాలని కోరారు.

KCR
  • Loading...

More Telugu News