Andhra Pradesh: చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనబడుతున్నారు!: తెలంగాణ మంత్రి తలసాని

  • ఆంధ్రా రాజకీయాలు కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి  
  • ఆంధ్రా వాళ్ల ఆస్తులు లాక్కుంటున్నారనడం తగదు
  • చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూనే ఆంధ్రా రాజకీయాలు తిరుగుతున్నాయని టీ- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనబడుతున్నారని సెటైర్లు విసిరారు. ఆంధ్రా వాళ్ల ఆస్తులు లాక్కుంటున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆయన తీరు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News