bellamkonda srinivas: 'మహా సముద్రం'లో మరో హీరో

  • అజయ్ భూపతి దర్శకుడిగా 'మహా సముద్రం'
  • వేగంగా జరుగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  •  రెండు నెలల్లో సెట్స్ పైకి    

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో అజయ్ భూపతి దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా భారీ వసూళ్లతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనతో సినిమా చేయడానికి యువ కథానాయకులంతా పోటీపడుతున్నారు. అలాగే బడా నిర్మాతలు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకి బెల్లంకొండ శ్రీనివాస్ ను కథానాయకుడిగా ఎంచుకున్నాడు.

ఈ సినిమాకి 'మహా సముద్రం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందనేది తాజా సమాచారం. ఇది ఒక మల్టీస్టారర్ అనీ .. మరో స్టార్ హీరోకి కూడా చోటు ఉందని చెబుతున్నారు. త్వరలోనే మరో హీరో ఎవరనే విషయాన్ని ఎనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుందట. 

More Telugu News