janasena: మా పార్టీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకే చంద్రబాబు కుట్రపూరిత వ్యాఖ్యలు: 'జనసేన' ప్రధాన కార్యదర్శి పార్థసారథి

  • ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చేందుకు బాబు వ్యూహం
  • టీడీపీ, వైసీపీ పప్పులు మా వద్ద ఉడకవు
  • అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేసి సత్తా చాటుతాం

జనసేన పార్టీ దూసుకు పోతుండడంతో రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకే చంద్రబాబు కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథి అన్నారు. ‘పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకేంటి అభ్యంతరం’ అంటూ ఇటీవల వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్థసారధి ఖండించారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన పార్టీ సమావేశం సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా జనసేనను అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. వందరోజుల ప్రోగ్రాంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, అధికారం సాధిస్తే చేయబోయే పనులను వివరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News