SCR: సంక్రాంతి కోసం... మరో 13 ప్రత్యేక రైళ్లు... వివరాలివి!

  • ఇప్పటికే నిండుకున్న రెగ్యులర్ రైళ్లు
  • కాకినాడ, సికింద్రాబాద్ మధ్య 7 రైళ్లు
  • నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు మూడు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పర్వదినం కోసం సొంతూళ్లకు వెళ్లాలని భావించే హైదరాబాద్ వాసులకు శుభవార్త. పండగ రద్దీ అధికంగా ఉండటం, రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ బెర్తులు నిండుకోవడంతో మరో 13 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిల్లో ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తామని పేర్కొంది. ఈ రైళ్లలో రెండు మినహా మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని తెలిపింది.

 కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ కు 16, 17, 20 తేదీల్లో రెండేసి. 18న ఒకటి, నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ కు 17న, సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు 13, 20 తేదీల్లో ఒక్కో రైలును నడిపిస్తామని, ఇవన్నీ సువిధ సర్వీసులేనని పేర్కొంది.

More Telugu News