KCR: నందమూరి సుహాసినికి ఇప్పుడు ఏం చేస్తారు?: చంద్రబాబుకి కేసీఆర్ ప్రశ్న

  • హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకున్నారు
  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే మోదీకి లేఖ రాస్తా
  • చంద్రబాబుకు నీతి, జాతి లేదు

ఇతరులను వాడుకుని వదిలేయడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చివరకు హరికృష్ణ చావును కూడా చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూశారని చెప్పారు. హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా దారుణంగా రాజకీయాలకు ఉపయోగించుకున్నారని... అమాయకురాలిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపారని విమర్శించారు. ఇప్పుడు ఆమెకు ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు.

ఓ వైపు రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని... మరోవైపు, మాకు ఆదాయం లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ మాట్లాడతారని.... రెండింటిలో ఏది నమ్మాలని కేసీఆర్ ప్రశ్నించారు. తన మాటలతో అందరినీ చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విషపూరితమైన రాజకీయం ఎవరికీ మంచిది కాదని అన్నారు.

కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చంద్రబాబు చెబుతున్నారని... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభల్లో చెప్పారని గుర్తు చేశారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉందని... అవసరమైతే ఏపీకి హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. చంద్రబాబుకు నీతి, జాతి లేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్వయం ప్రకాశశక్తి లేని నాయకుడని అన్నారు. మామ పార్టీని లాక్కుని అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News