vamsikrishna: బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు'కథ?

  • మరో బయోపిక్ గా 'టైగర్ నాగేశ్వరరావు'
  • నిన్నమొన్నటి వరకూ హీరోగా రానా పేరు ప్రచారం 
  • తాజాగా తెరపైకి బెల్లంకొండ శ్రీనివాస్ పేరు  

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. కొన్ని బయోపిక్ లు విడుదలకి సిద్ధమవుతూ వుంటే, మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను దర్శకుడు వంశీకృష్ణ రూపొందించనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు అప్పట్లో ధనికులను దోచేసి ఆ ధనాన్ని పేదవారికి పంచేవాడని చెప్పుకునేవారు.

ఈ బయోపిక్ ను ముందుగా నానితో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత రానా పేరు తెరపైకి వచ్చింది. ఈ రాబిన్ హుడ్ తరహా పాత్రకి రానా సరిగ్గా సరిపోతాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రానా కూడా చేయడం లేదనేది తాజా సమాచారం. ఈ కారణంగానే ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిందట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ .. దర్శకుడు వంశీకృష్ణ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అంటాడో లేదో చూడాలి మరి. 

More Telugu News