bellamkonda srinivas: కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'

  • కాజల్ తాజా చిత్రంగా వచ్చిన 'కవచం'
  • తేజ దర్శకత్వంలో తదుపరి సినిమా 
  • నాయిక చుట్టూ తిరిగే కథ    

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా .. కాజల్ కథానాయికగా తెరకెక్కిన 'కవచం' ప్రస్తుతం థియేటర్లలో వుంది. ఈ సినిమా  తమకి సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో ఈ ఇద్దరూ వున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే తేజ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ కథ అంతా కూడా కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. అందువలన టైటిల్ కూడా కాజల్ పాత్ర పరంగా 'సీత' అని పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.

టైటిల్ కాజల్ పాత్రను బట్టి ఉంటుందని తేజ చెప్పినప్పటికీ, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలాగే తన సినిమాల్లో భారీతనం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాంటి బెల్లంకొండ శ్రీనివాస్ నాయికా ప్రాధాన్యత కలిగిన 'సీత' సినిమాను చేస్తుండటం విశేషమే.      

More Telugu News