bellamkonda srinivas: ప్రేమను మించిన ప్రేమేలేదు .. ఆకట్టుకుంటోన్న 'కవచం'సాంగ్

  • 'కవచం' నుంచి మెలోడీ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో .. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా 'కవచం' సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. "ప్రేమను మించిన ప్రేమేలేదని మనసును ప్రశ్నించాను .. ఊపిరి మించిన శ్వాసే లేదని గాలిని ప్రశ్నించాను" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ పై అందమైన .. అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ కొత్తగా అనిపిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, మరో కథానాయికగా మెహ్రీన్ నటించింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో శ్రీనివాస్ వున్నాడు. 

More Telugu News