Andhra Pradesh: జగన్ పార్టీ గుర్తుగా ‘ఫ్యాన్’ ను తీసేసి ‘కోడి కత్తి’ని పెట్టుకోవాలి!: టీడీపీ నేత సోమిరెడ్డి

  • చంద్రబాబుపై జగన్ కుట్ర పన్నారు
  • కోడికత్తి ఎపిసోడ్ ఫ్లాప్ అయింది
  • విపక్షాలను బాబు ఏకం చేశారు

ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబును గద్దె దించేందుకు ప్రతిపక్ష నేత జగన్ కుట్ర పన్నారని కర్నూలు టీడీపీ నేత, కుడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. జగన్ కోడి కత్తి నాటకం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. ఏపీ పోలీసుల సహకారం లేకుండా జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్లు ప్రశాంతంగా ఎలా సాగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలను కూల్చడంలో వైసీపీ అధినేత దిట్ట అని సోమిరెడ్డి విమర్శించారు. ఒకవేళ జగన్ సీఎం అయితే ఏపీ పరిస్థితి అంతే సంగతులని వ్యాఖ్యానించారు. జగన్‌, పవన్‌ రాష్ట్రాన్ని నాశనం చేసే దుష్ట శక్తులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ గుర్తుగా ఫ్యాన్ ను తీసేసి కోడి కత్తిని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు దేశంలోని 16 విపక్ష పార్టీలను ఏకం చేశారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News