bellamkonda srinivas: మాస్ హీరో సినిమాకి మళ్లీ భారీగానే ఖర్చు

  • తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 
  • కథానాయికలుగా కాజల్ .. మెహ్రీన్ 
  • కాంబోడియాలో జరుగుతోన్న షూటింగ్    

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నీ కూడా ఆయన మార్కెట్ కి మించినవే. ఇటీవల వచ్చిన 'సాక్ష్యం' సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ సినిమాను పరుగులు తీయించలేకపోయింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి సినిమా బడ్జెట్ తక్కువగానే ఉండొచ్చని చెప్పుకున్నారు. కానీ ఆయన తాజా చిత్రానికి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారనేది తాజా సమాచారం.

శ్రీనివాస్ తాజా చిత్రం .. తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. మెహ్రీన్ .. కాజల్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాంబోడియాలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ను కూడా విదేశాల్లోనే ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ దాటిపోయిందట. అయినా నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకపోవడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.      

More Telugu News