Andhra Pradesh: సైకో అన్న అనుమానంతో చితకబాదేశారు!

  • తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి
  • తలపైనా, ఒంటిపైనా పెద్ద గాయాలు
  • సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఘటన

అతను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. తన మానాన తాను నడిచి వెళ్తుండగా పలువురు చుట్టుముట్టారు. సైకో అన్న అనుమానంతో చితకబాదేశారు. దీంతో శరీరంపై తీవ్రగాయాలతో ఈ గుర్తు తెలియని వ్యక్తి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పి.గన్నవరం మండలం జి.పెదపూడి, కొత్తపేట మండలం గంటి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థులు దాడికి పాల్పడిన అనంతరం ఫోన్‌లో పోలీసులకు సమాచారమిచ్చారు. హెచ్‌సీ నూకరాజు, కానిస్టేబుళ్లు జి.పెదపూడి వెళ్లి క్షతగాత్రుడిని పి.గన్నవరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో 108 అంబులెన్స్‌లో అమలాపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News