bellamkonda srinivas: నా మీద నమ్మకం పెట్టుకుని శ్రీవాస్ థాయ్ ల్యాండ్ వచ్చారు: బెల్లంకొండ శ్రీనివాస్

  • 'జయ జానకి నాయక' షూటింగులో వున్నాను 
  • అప్పటికి టీజర్ కూడా బయటికి రాలేదు 
  • ఆ సమయంలో 'సాక్ష్యం' కథ విన్నాను    

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం' సినిమా రూపొందింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

"ముందుగా నేను ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను 'జయ జానకి నాయక' సినిమా చేస్తున్నాను .. అప్పటికి ఇంకా టీజర్ గానీ .. ట్రైలర్ గాని రాలేదు. అయినా ఆయన నన్ను నమ్మారు. 'జయ జానకి నాయక' సినిమా కోసం నేను థాయ్ ల్యాండ్ లో ఉండగా ఆయన అక్కడికి వచ్చి నాకు ఈ కథ చెప్పారు. కథ విన్నాక .. ఇంత గొప్ప ఆలోచన రావడంతోనే సగం సక్సెస్ వచ్చేసినట్టని అన్నాను. ఈ కథకి తాము అనుకున్నట్టుగా అవుట్ పుట్ తెచ్చుకోగలిగితే హిట్ ఖాయమని చెప్పాను. ఆశించినట్టుగానే ఈ సినిమాకి మంచి టీమ్ దొరికింది. అంతా కూడా చాలా ఇష్టపడి, కష్టపడి ఈ సినిమాకి పనిచేశారు" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News