New Delhi: ఢిల్లీలో 11 మంది మృతి ఘటన.. కొన్ని గంటల ముందే వారికి రోటీలిచ్చిన ఫుడ్‌ డెలివరీ బోయ్‌

  • మీడియాతో మాట్లాడిన సదరు కుర్రాడు
  • రాత్రి 10.30 గంటలకు వారు రోటీలు ఆర్డర్‌ చేశారు
  • నేను రాత్రి 10.45కి ఆ రోటీలు తీసుకెళ్లి ఇచ్చాను
  • ఆ సమయంలో అక్కడ సాధారణ వాతావరణమే ఉంది

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో మూఢ నమ్మకాల వలలో చిక్కుకుని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దేశం యావత్తు నివ్వెరపోయేలా జరిగిన ఈ ఘటనలో వారి మృతి వెనుక ఏదో కుట్ర ఉందని వారి బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ వారు ముక్తి కోసమే ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, వారు ఈ ఘటనకు పాల్పడడానికి కొన్ని గంటల ముందు వారిని ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చూశాడు. తాజాగా ఆ బాలుడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... "రాత్రి 10.30 గంటలకు వారు 20 రోటీలు ఆర్డర్‌ చేశారు. నేను రాత్రి 10.45కి ఆ రోటీలు తీసుకెళ్లి ఇచ్చాను. ఆ ఇంట్లో భాటియా కుమార్తె రోటీలను తీసుకుంది. తండ్రిని బిల్లు కట్టమని చెప్పింది. ఆ సమయంలో ఆ ఇంట్లో అంతా సాధారణ వాతావరణమే ఉంది" అని చెప్పాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

  • Loading...

More Telugu News