Rahul Gandhi: 2016లో 19,675 మం‍ది మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు: రాహుల్‌ గాంధీ మండిపాటు

  • దారుణ ఘటనలపై మోదీ మౌనంగా ఉంటున్నారు
  • కేసులను త్వరితగతిన విచారించాలి
  • దోషులను కఠినంగా శిక్షించాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మైనర్‌ బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయని, మోదీ మాత్రం ఈ దారుణ ఘటనలపై మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. 2016లో 19,675 మం‍ది మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు జరిగాయని పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. ఈ కేసులను త్వరితగతిన విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఒకే ఒక్క ఏడాదిలోనే ఇంతమంది మైనర్లపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటని, వారికి న్యాయం జరగాలని ప్రధాని నిజంగా ఆకాంక్షిస్తున్నట్లయితే ఈ కేసులపై సమర్థవంతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News