New Delhi: బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి: ఢిల్లీలో టీడీపీ ఎంపీలు

  • నెల రోజుల పాటు పార్లమెంటులో మా నిరసన తెలిపాం
  • అన్ని ప్రతిపక్షాలు బీజేపీపై మండిపడుతున్నాయి
  • అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధేస్తోంది
  • ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి ఏ పాటి గౌరవం ఉందో అర్థమవుతోంది

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా పార్లమెంటులో సుమారు నెల రోజుల పాటు తమ నిరసన తెలిపామని టీడీపీ ఎంపీలు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై మండిపడుతున్నాయని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి ఏ పాటి గౌరవం ఉందో అర్థమవుతోందని అన్నారు.

మరోవైపు వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీలు అన్నారు. అప్పట్లో ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎలా సాధించుకుంటామని జగన్ అన్నారని, ఇప్పుడు రాజీనామా చేశారని విమర్శించారు. వైసీపీ నేతలు నీతులు చెబుతోంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.

అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇస్తే ఎందుకు చర్చ జరపలేదని స్పీకర్‌ను అడిగామని టీడీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మోదీ డైరెక్షన్ లో జగన్ యాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఏపీ హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News