Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు

  • కేంద్ర ప్రభుత్వంపై పోరాటం
  • వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీ పర్యటన
  • పలు పార్టీల నేతలతో చర్చలు

ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై పోరాటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా వచ్చేనెల 2,3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోగా, ఇప్పుడు 3, 4 తేదీల్లో ఢిల్లీలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఢిల్లీలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడమే అజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండనుంది. విభజన హామీలను పక్కనబెట్టి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని చంద్రబాబు పలు పార్టీలకు వివరించనున్నారు.

  • Loading...

More Telugu News