KTR: గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన గబ్బర్‌సింగ్‌లు కాలేరు!: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్

  • గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారు
  • గుజరాత్‌లో అందరూ ఏకమైనప్పటికీ కాంగ్రెస్ ఓడింది
  • మా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది
  • వారి కష్టాలు తీర్చడానికి 24 గంటల విద్యుత్ అందిస్తోంది

గడ్డాలు పెంచుకుంటే గబ్బర్‌సింగ్‌లు కాలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని, గుజరాత్‌లో అందరూ ఏకమైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఎంతో చక్కగా నిర్వహిస్తోందని, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం అసెంబ్లీ సమావేశాలంటేనే పారిపోతాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఇద్దరూ రైతులేనని అన్నారు. రైతుల కష్టాలు ఎలా ఉంటాయో వారికి తెలుసని అన్నారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని, అలాగే వారి కష్టాలు తీర్చడానికి 24 గంటల విద్యుత్ అందిస్తోందని చెప్పారు. 

  • Loading...

More Telugu News