samanta: వచ్చే ఏడాది వరుస సినిమాలతో సందడి చేయనున్న సమంత

  • జనవరి 26న 'ఇరుంబు తిరై' విడుదల 
  • మార్చి 29న 'మహానటి' రిలీజ్ 
  • మార్చి 30వ తేదీన 'రంగస్థలం' 

ఇటీవల 'రాజుగారి గది 2' సినిమా చేసిన సమంత .. వచ్చే ఏడాది వరుస సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని ఆమె నటించిన మొత్తం మూడు సినిమాలు ప్రేక్షకులను వరుసగా పలకరించనున్నాయి. తమిళంలో ఆమె చేసిన 'ఇరుంబు తిరై' జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఇక తెలుగులో ఆమె చేస్తోన్న 'మహానటి' సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి రోజునే .. అంటే మార్చి 30వ తేదీన 'రంగస్థలం' భారీస్థాయిలో విడుదల కానుంది. ఇలా సమంత వరుస సినిమాలతో అభిమానులకు ఆనందాన్ని కలిగించనుంది. 'మహానటి'లో ప్రధానపాత్ర కాకపోయినా ముఖ్యమైనదే. ఇక కథానాయికగా చేస్తోన్న 'ఇరుంబు తిరై' .. 'రంగస్థలం' సినిమాలు సూపర్ హిట్ కావడం ఖాయమనే నమ్మకంతో సమంత వుంది.    

  • Loading...

More Telugu News