KTR: జీహెచ్ఎంసీలో ఓడిన‌ప్పుడే టీడీపీ ఆంధ్రాకు ప‌రిమిత‌మైందని తెలిసిపోయింది!: కేటీఆర్

  • తెలంగాణ‌లో టీడీపీ ఎప్పుడో చ‌చ్చిపోయింది
  • మాకున్న‌ ఏకైక శ‌త్రువు కాంగ్రెస్
  • దేశానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్
  • ప్ర‌జ‌లు మావైపే ఉన్నారు

కాంగ్రెస్ నేత‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ... జీహెచ్ఎంసీలో ఒక్క‌చోట గెలిచిన‌ప్పుడే టీడీపీ ఆంధ్రాకు ప‌రిమిత‌మైందని తెలిసిపోయింద‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ ఎప్పుడో చ‌చ్చిపోయిందని ఎద్దేవా చేశారు. త‌మ‌కు కాంగ్రెస్ పార్టీయే ఏకైక శ‌త్రువని వ్యాఖ్యానించారు. దేశానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్ పార్టీ అని విమ‌ర్శించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి న‌ల్గొండ‌ ఫ్లోరైడ్ స‌మ‌స్య‌పై ఆలోచించ‌లేదని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం హాస్యాస్పద‌మ‌ని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మంచి ప‌నులు చేయ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓట్లు వేయొద్ద‌ని చెప్పిన ఒకేఒక ద‌మ్మున్న నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపే ఉంటున్నారని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News