cricket: అర్ధ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన శిఖ‌ర్ ధావ‌న్‌.. 100 మార్కు దాటిన టీమిండియా స్కోరు

  • చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో 37 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం
  • 12 ఓవ‌ర్ల‌కి టీమిండియా స్కోరు 100

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న మొద‌టి టీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రాణిస్తోంది. ఓపెన‌ర్ శిఖ‌ర్ దావ‌న్ చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో అర్ధ శ‌త‌కం సాధించాడు.  రోహిత్ శ‌ర్మ 35 బంతుల్లో 40 ప‌రుగులు చేయ‌గా, శిఖ‌ర్ ధావ‌న్ 39 బంతుల్లో 52 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 12 ఓవ‌ర్ల‌కి 100 గా ఉంది. 12 ఓవ‌ర్లు దాటిపోయిన‌ప్ప‌టికీ న్యూజిలాండ్ బౌల‌ర్లు ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా.. న్యూజిలాండ్ ముందు భారీ ల‌క్ష్యం ఉంచే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News