cricket: దీటుగా ఆడుతూ... టీమిండియాను ఆదుకున్న హార్థిక్ పాండ్యా కూడా ఔట్!

  • టీమిండియా స్కోరు 41 ఓవ‌ర్ల‌కి 205/6
  • 48 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన హార్థిక్ పాండ్యా

చెన్నైలో జ‌రుగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియా మొద‌టి వ‌న్డే మ్యాచులో కీల‌క వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ప‌డిన‌ టీమిండియాను హార్థిక్ పాండ్యా, మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. 48 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన హార్థిక్ పాండ్యా స్కోరు బోర్డుని క‌దిలించాడు.  అయితే, 83 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరుకి, 40.5 ఓవ‌ర్ల‌ వ‌ద్ద‌ భారీ షాటుకి ప్ర‌య‌త్నించి అవుట‌య్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ (37), భువ‌నేశ్వ‌ర్ కుమార్ (0)  ఉన్నారు. టీమిండియా స్కోరు 41 ఓవ‌ర్ల‌కి 205/6 గా ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ర‌హానే 5, రోహిత్ శ‌ర్మ 28, కోహ్లీ 0, మ‌నీష్ పాండే 0, కేద‌ర్ జాద‌వ్ 40, హార్థిక్ పాండ్యా 83 ప‌రుగులు తీశారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో నాథ‌న్ కౌల్టెర్ మూడు వికెట్లు తీయ‌గా మార్క‌స్ స్టోయినిస్ రెండు వికెట్లు, అడం జంపా ఒక వికెట్‌ తీశాడు.

  • Loading...

More Telugu News