cricket: కాన్పూర్ టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌


ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు నుంచి టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. కాన్పూర్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొద‌ట‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాలో ఆల్‌రౌండ‌ర్ ప‌ర్వేజ్ ర‌సూల్ అరంగేట్రం చేయ‌నున్నాడు. జ‌మ్ముక‌శ్మీర్ నుంచి ఓ ఆట‌గాడు టీమిండియాకు ఆడ‌టం ఇదే మొద‌టిసార‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే టీమిండియా చేతిలో టెస్టు, వ‌న్డే సిరీస్‌లు కోల్పోయిన ఇంగ్లండ్ టీ20 సిరీస‌యినా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

  • Loading...

More Telugu News