cricket: కాన్పూర్ చేరుకున్న విరాట్ కోహ్లీ సేన‌.. 26 నుంచి టీ20 మ్యాచ్‌ లు


ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇప్ప‌టికే టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌ను పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక మిగిలింది మూడు టీ20 మ్యాచ్‌లే. ఈ నెల 26 నుంచి టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీమిండియాతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ ఈ రోజు మ‌ధ్యాహ్నం కాన్పూర్ చేరుకుంది. అక్క‌డి గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియంలో మొద‌టి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విద‌ర్భ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రుగుతుంది. ఇక చివ‌రి టీ20 మ్యాచ్ బెంగ‌ళూరులోని ఎం.చిన్న‌స్వామి స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు.

మొద‌టి టీ20 మ్యాచ్ ఈ నెల 26న సాయంత్రం 4.30 ప్రారంభం కానుండ‌గా, రెండు, మూడ‌వ మ్యాచ్‌లు రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి. ఇప్ప‌టికే టీమిండియా టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌ను గెలుచుకుని రెట్టించిన ఉత్సాహంతో ఉంది. టీ20ని కూడా సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు క‌నీసం టీ20ల్లో న‌యినా గెల‌వాల‌ని ఇంగ్లండ్ టీమ్ ఆశ‌ప‌డుతోంది.

  • Loading...

More Telugu News