cricket: రన్ అవుట్ అయిన హేల్స్... తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్


పుణె వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ ఓడిన ఇంగ్లండ్ టీమ్‌ బ్యాటింగ్‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఓపెనర్లుగా జేజే రాయ్‌, ఏడీ హేల్స్ క్రీజులోకి వ‌చ్చారు. అయితే, బుమ్రా బౌలింగ్‌లో హేల్స్(9 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌) ర‌న్ అవుట్ గా వెనుదిగాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన మ‌రో బ్యాట్స్‌మెన్ జేజే రాయ్ 43 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. హేల్స్ అవుట‌యిన త‌రువాత జేఈ రూట్ క్రీజులోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 9 ఓవ‌ర్ల‌కు 60 ప‌రుగులుగా ఉంది.

  • Loading...

More Telugu News