ద్వార లక్ష్మీ పూజా ఫలితం

సాధారణంగా అమ్మాయిల వివాహం విషయంలో అనుకోకుండా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మంచి సంబంధాలు రాకపోవడం .. మంచి సంబంధం అనుకున్నది తప్పిపోవడం .. అంతా మాట్లాడుకున్నాక చివరి నిమిషంలో ఏదో ఒక కారణంగా సంబంధాలు చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో అమ్మాయి తరఫువాళ్లు ఆందోళనకి లోనవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వారలక్ష్మీ పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.

వివాహం విషయంలో  ఆలస్యమవుతున్న యువతులు, తెల్లవారు జామునే నిద్రలేవాలి. గడపను ముందుగా పాలతోను .. ఆ తరువాత నీళ్లతోను తుడవాలి. ద్వారానికి మామిడితోరణాలు కట్టి, గడపకు పసుపు కుంకుమలు పెట్టాలి. ఆ తరువాత రెండు దీపాలు వెలిగించి, గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. లక్ష్మీనారాయణుల అష్టోత్తరాన్ని అంకితభావంతో చదివి గడపకు హారతి ఇవ్వాలి. ఈ విధంగా 16 రోజుల పాటు చేయడం వలన, వివాహం విషయంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయనేది పెద్దల మాట.        


More Bhakti News