ప్రసిద్ధి చెందిన శ్రీరామ క్షేత్రాలు

శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు .. సీతమ్మ తల్లి ఆదర్శానికి ఆనవాలు. అలాంటి సీతారాముల ఆలయం లేని గ్రామమంటూ కనిపించదు. అంతగా సీతారాములు భారతీయుల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి గ్రామంలోను నిత్యపూజలు అందుకుంటున్నారు. సీతారాములు కొలువైన పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటిలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు 25 వరకూ ఉన్నాయని ఆధ్యాత్మిక గంథాలు చెబుతున్నాయి.

ఆ జాబితాలో .. రామతీర్థము .. గోదావరి తీర్థము .. అయోధ్య .. మిథిల .. నాసిక్ .. పంచవటి .. రామగిరి .. లక్ష్మణపురం .. గంధమాదనం .. పంపాతీరం .. కిష్కింద .. యమునా తీరం .. చిత్రకూటం .. పర్ణశాల .. నంది గ్రామం .. భద్రగిరి .. హంపి .. జీడికల్లు .. ఒంటిమిట్ట .. తిరువళ్లూరు .. తిరుపతి .. మధురాంతకం .. శ్రీరంగం .. దర్భశయనం .. తిరుప్పల్ నొడి .. క్షేత్రాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తాయనేది పెద్దల మాట.  


More Bhakti News