తమ్మర సీతారామాలయం

శ్రీరామచంద్రుడు వెలసిన ప్రాచీన క్షేత్రాల్లో 'తమ్మర' ఒకటిగా కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమంతుడి ఆలయం మాత్రమే ఉండేదట. ఆ తరువాత చాలా కాలానికి ఊళ్లో వాళ్లంతా కలిసి, హనుమంతుడి ఎదురుగా రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆ ఊరిలో ఒక బాలుడి ద్వారా దైవం తన వాక్కును వినిపించింది. హనుమంతుడి ఆలయానికి సమీపంలోగల పుట్టలోనే సీతారాముల మూర్తి ఉందనీ, ఆ మూర్తిని వెకిలికి తీసి ప్రతిష్ఠ చేయమని పలికిందట. దాంతో గ్రామస్థులు పవిత్రులై ఆ పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా, లోపల స్వామివారి మూర్తి కనిపించింది. దాంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆ మూర్తిని ప్రతిష్ఠించారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి తొడపై సీతమ్మవారు కూర్చుని ఉండటం విశేషం. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.


More Bhakti News