కన్నీళ్లు పెట్టుకున్న సీతమ్మవారు

సీతారామచంద్రస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'తమ్మర' ఒకటి. సూర్యాపేట జిల్లా .. కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పడం వలన, కొంతమంది భక్తులు పూనుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సీతారామలక్ష్మణుల ప్రతిష్ఠ జరిగిన తరువాత, పూజలు మొదలయ్యాయి. స్వామివారు అప్పగించిన పనులను పూర్తి చేశామనే సంతృప్తితో భక్తులు నిద్రించారట.

అప్పుడు ఒక భక్తుడి కలలో సీతాదేవి కనిపించిందట. 'అమ్మా ఎందుకు ఆ కన్నీళ్లు?' అని ఆయన అడిగితే, స్వామివారి సేవకి అవసరమైన నీళ్లను దూరం నుంచి తెచ్చుకోలేకపోతున్నాని అమ్మవారు చెప్పిందట. అంతే ఆ భక్తుడు మరునాడు ఉదయమే ఆలయానికి చేరుకుని, జరిగిందంతా మిగతావారికి చెప్పాడు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వించాడు. ఈ బావిలో నీరు తియ్యగా ఉంటుంది .. ఇంతవరకూ ఈ బావిలో నీరు ఎండిపోకపోవడం విశేషం.


More Bhakti News