'వెన్నవరం' కోనేరు మహిమ ఇదే

వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో 'వెన్నవరం' ఒకటిగా కనిపిస్తుంది. మహబూబా బాద్ జిల్లా .. డోర్నకల్ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ స్వామివారు వెలసిన కొండ 'వెన్నముద్ద' ఆకారంలో ఉండటం వలన, ఈ గ్రామానికి 'వెన్నవరం' అనే పేరు వచ్చిందని అంటారు. స్వామివారు ఆవిర్భవించిన సమయంలోనే ఈ కొండ రెండుగా చీలిపోయి 'కోనేరు' ఏర్పడిందని అంటారు. ఇది చాలా లోతైన కోనేరు అని చెబుతారు.

ఈ కోనేటి నీటిని తమ పొలం అవసరాలకి .. ఇంటి అవసరాలకి వాడుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. ఇది స్వామివారి మహిమగానే భావించిన గ్రామస్థులు ఈ కోనేటి నీటిని తమ సొంత వసరాలకి ఎలాంటి పరిస్థితుల్లోను ఉపయోగించరు. స్వామివారి కైంకర్యాలకు అర్చకులు మాత్రమే ఈ కోనేటి నీటిని ఉపయోగిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ కోనేరు నీటిని తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాలు నశిస్తాయనేది భక్తుల విశ్వాసం.                


More Bhakti News