పాపాలను హరించే పరమేశ్వరుడు

పరమశివుడు అనేక ప్రదేశాల్లో కొలువై భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఆలయం మనకి 'మీర్ ఖాన్ పేట'లో కనిపిస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లా .. కందుకూరు మండలం పరిథిలో కనిపిస్తుంది. ఈ శివాలయం దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇక్కడి శివయ్యను .. రామలింగేశ్వరుడిగా భక్తులు పిలుచుకుంటూ వుంటారు.

ఇటీవలే ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. క్షేత్ర పాలకుడైన హనుమంతుడిని కూడా ఇటీవలే పునః ప్రతిష్ఠ చేశారు. ఇక్కడి రామలింగేశ్వరుడిని దర్శించుకోవడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ పక్కనే రామాలయాన్ని కూడా నిర్మించారు. భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒకే ప్రాంగణంలో కొలువై వున్న శివకేశవులను దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.        


More Bhakti News